Monday, April 29, 2024

తెలుగు రాష్ట్రాల్లో మరో రెండ్రోజుల పాటు వర్షాలు

గ‌త రెండు రోజుల క్రితం వ‌ర‌కు ఎండ‌లు వేడి తీవ్రత‌రంగా ఉండేవి. అయితే ఒక్క‌సారిగా వాతావ‌ర‌ణం చ‌ల్ల‌బ‌డింది. తెలంగాణ మీదుగా ఉపరితల ద్రోణి ఆవరించి ఉండటంతో తెలుగు రాష్ట్రాల్లో మరో రెండ్రోజుల పాటు భారీ వర్షాలు నమోదవుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఏపీలో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. తెలంగాణలో ఒకట్రెండు చోట్ల ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఏపీలో పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరికలను వాతావరణ శాఖ జారీ చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement