Friday, May 10, 2024

Mantralayam – రాఘవుడి సేవలో శ్రీ రఘువరేంద్ర తీర్థులు

మంత్రాలయం, జులై,2, (ప్రభ న్యూస్ ): ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి సన్నిధిలో చాతుర్మాస్య దీక్షను స్వీకరించేందుకు శ్రీ భీమనకట్టె మఠం పీఠాధిపతులు శ్రీ రఘువరేంద్ర తీర్థులు ఆదివారం మంత్రాలయం చేరుకున్నారు. మఠం సాంప్రదాయ పద్ధతిలో మఠం అధికారులు ఘన స్వాగతం పలికారు. వారు ముందుగా గ్రామ దేవత శ్రీ మంచాలమ్మను దర్శించుకుని పూజలు చేశారు. అలాగే శ్రీ రాఘవేంద్ర స్వామి మూల బృందావనాన్ని దర్శించుకొని పూజలు చేశారు.

మఠం ఆధ్వర్యంలో చతుర్మాసదీక్ష 45 రోజులు జరిగే రాఘవేంద్ర స్వామి సన్నిధిలో ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మఠం మేనేజర్లు వెంకటేష్ జ్యోసి,ఎస్కే శ్రీనివాసరావు,ఐపి నరసింహమూర్తి, వ్యాసరాజాచార్,బిందు మాధవ్, శ్రీనిధి,తదితర మఠం సిబ్బంది పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement