Sunday, April 28, 2024

నా కాళ్లు వాచిపోయేలా పోలీసులు కొట్టారు: RRR

పోలీసులు తన కాళ్లు వాచిపోయేలా కొట్టారని నరసాపురం వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు సంచలన ఆరోపణలు చేశారు. ఎంపీ రఘురామ కృష్ణరాజును శనివారం పోలీసులు సీఐడీ కోర్టులో హాజరుపరిచారు. రఘురామ బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు డిస్మిస్ చేసి.. కింది కోర్టుకు వెళ్లాలని సూచించిన నేపథ్యంలో ఆయన్ను గుంటూరులోని సీఐడీ న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా రిమాండ్‌ రిపోర్టును జడ్జికి అందజేశారు. రఘురామపై సీఐడీ అధికారులు పెట్టిన సెక్షన్లు వర్తించవని, రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్న ఆ సెక్షన్లను రద్దు చేయాలంటూ ఆయన తరఫు న్యాయవాది వాదించినట్లు సమాచారం. అయితే, రఘురామకృష్ణరాజు తరఫు న్యాయవాదులు సీఐడీ కోర్టులో బెయిల్‌ పిటిషన్‌తో పాటు అత్యవసర వైద్యసాయం కోరుతూ మరో పిటిషన్‌ దాఖలు చేశారు. తనను పోలీసులు కాళ్లు వాచిపోయేలా కొట్టారని, నిన్న రాత్రి వేధింపులకు గురిచేశారంటూ రఘురామ కృష్ణరాజు సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు నాలుగు పేజీల లిఖితపూర్వక ఫిర్యాదును న్యాయమూర్తికి అందజేశారు.

మరోవైపు, ఇప్పటికే రఘురామ తరఫు న్యాయవాదులు దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టు… కింది కోర్టులోనే బెయిల్‌ కోసం సంప్రదించాలని సూచించింది. దీంతో సీఐడీ అధికారులు ఆయనపై రిమాండ్‌ రిపోర్టును సిద్ధం చేసి సీఐడీ కోర్టులో హాజరు పరిచారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement