Saturday, May 25, 2024

ఢిల్లీ ఎయిమ్స్ లో రఘురామకు చికిత్స!

సికింద్రాబాద్‌ ఆర్మీ ఆసుప‌త్రి నుంచి డిశ్చార్జ్ అయిన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రికి వెళ్లారు. ఆర్మీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్  అయిన తర్వాత అక్కడి నుంచి బేగంపేట ఎయిర్​పోర్ట్ చేరుకున్న రఘరామ… ప్రత్యేక విమానంలో నేరుగా ఢిల్లీకి  వెళ్లారు. తదుపరి చికిత్స కోసం ఎయిమ్స్‌లో రఘురామ చేరే అవకాశం ఉంది.

కాగా, రఘురామకృష్ణరాజుకు సుప్రీం కోర్టు ష‌ర‌తుల‌తో కూడిన‌ బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. కేసు గురించి మీడియాతోగానీ, సోష‌ల్ మీడియాలో గానీ మాట్లాడ‌వ‌ద్ద‌ని సుప్రీంకోర్టు  ష‌ర‌తు విధించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించారనే ఆరోపణలపై రఘురామపై ఏపీ సీఐడీ అధికారులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అరెస్ట్‌ చేసి గుంటూరు జైలుకు తరలించారు. అనంతరం రఘురామరాజుకు బెయిల్ మంజూరు చేస్తూ ఈనెల 21న సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈనెల 24న ఆయన తరఫున న్యాయవాదులు గుంటూరు సీఐడీ కోర్టులో పూచీకత్తు సమర్పించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement