Friday, April 26, 2024

ఎంపీ విజయసాయిపై స్పీకర్‌కు రఘురామ ఫిర్యాదు

వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేశారు. స్పీకర్ ఓంబిర్లా, సభా హక్కుల కమిటీ చైర్మన్‌కు రఘురామకృష్ణంరాజు లేఖ రాశారు. స్పీకర్ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై సభా హక్కుల సంఘం చైర్మన్‌కి రఘురామ ఫిర్యాదు చేశారు. సభా కార్యక్రమాలను అడ్డుకుంటామంటూ విజయసాయిరెడ్డి బెదిరింపులకు దిగారని లేఖలో ఆరోపించారు. గతంలో రాజ్యసభ చైర్మన్‌పైనా ఇలాంటి వ్యాఖ్యలు చేశారని రఘురావ గుర్తు చేశారు. ఇప్పుడు కూడా స్పీకర్‌పై విజయసాయిరెడ్డి వ్యాఖ్యలే చేశారని పేర్కొన్నారు. విజయసాయిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని రఘురామ లేఖలో కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement