Thursday, May 2, 2024

కావాలనే సెంటిమెంట్ ను రెచ్చగొడుతున్నారు: సోము వీర్రాజు

కేసీఆర్ కు హుజూరాబాద్ ఉప ఎన్నిక భయం పట్టుకుందని, అందుకే కావాలని సెంటిమెంట్ ను రెచ్చగొడుతున్నాడని సోము వీర్రాజు ఆరోపించారు. రెండు రాష్ట్రాల మధ్య జలవివాదం ఓ పెద్ద డ్రామా అని అభివర్ణించారు. రాయలసీమ ప్రాజెక్టుల అంశంపై నేడు కర్నూలులో సీమ బీజేపీ నేతలతో సమావేశం జరిగింది. రాయలసీమలో అనేక పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయని, ఈ ప్రాజెక్టుల అంశాలపై రాబోయే రోజుల్లో ఉద్యమం చేస్తామని వెల్లడించారు. ప్రాజెక్టులు పూర్తి చేయాల్సింది పోయి వివాదాలు ఎందుకు? అని సీఎం జగన్ కు హితవు పలికారు. త్వరలో విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తామని, ప్రాజెక్టుల అంశంపై చర్చిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో సోము వీర్రాజు, ఏపీ బీజేపీ సహ ఇన్చార్జి సునీల్ దేవధర్, బీజేపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్, ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి, ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు ఆదినారాయణరెడ్డి, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: దేశంలో కరోనా ‘కప్పా వేరియంట్’

Advertisement

తాజా వార్తలు

Advertisement