Saturday, May 18, 2024

రేపు రాఘవేంద్రస్వామి పుట్టిన రోజు వేడుకలు.. పట్టు వస్త్రాలు పంపిన టీటీడీ

మంత్రాలయం, (ప్రభ న్యూస్): గురు వైభవోత్సవాల్లో భాగంగా రాఘవేంద్ర స్వామి మఠంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇందులో పుణ్యక్షేత్రమైన మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి 427వ పుట్టిన రోజు వేడుకలను బుధవారం శ్రీ మఠం పీఠాధిపతులు సుభుదేంద్ర తీర్థులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ముందుగా గ్రామ దేవత మంచాలమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

అనంతరం రాఘవేంద్ర స్వామి మూల బృందావనాన్నికి ప్రత్యేక పూజలు నిర్వహించి తదనంతరం టీటీడీ తరపున పట్టు వస్త్రాలు సమర్పిస్తారని తెలియజేశారు. కార్యక్రమానికి కర్నాటక, ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నట్లు శ్రీ మఠం అధికారులు తెలిపారు. అలాగే రాజకీయ, సినీ ప్రముఖులు కూడా హాజరు కానున్నట్లు అధికారులు తెలిపారు. గురు వైభవోత్సవాల్లో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా భక్తులను ఎంతగానో అలరించనున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement