Saturday, April 27, 2024

Counter: కొడాలి నానికి పురేంధేశ్వ‌రీ కౌంట‌ర్

కొడాలి నానికి బీజేపీ ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి కౌంటర్‌ ఇచ్చారు. ప్రకాశం జిల్లాలో దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో అరాచక, విధ్వంసకర, వినాశకర పాలన సాగిస్తున్నారన్నారు. దేవుడి విగ్రహాల నుంచి, గర్బ గుడిలో ఉన్న విగ్రహాలను కూడా ధ్వంసం చేస్తున్నారని ఫైర్‌ అయ్యారు.

మోదీ అన్నీ కులాలకు న్యాయం చేయాలని పాలన చేస్తుంటే సీఎం జగన్ సామాజిక, సాధికార యాత్రల పేరిట మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని, సామాజిక, సాధికార యాత్రలు చేసే నైతిక హక్కు ఉందా..అని ప్రశ్నించారు. టీటీడీలో అన్యమతస్తులను చైర్మన్లుగా నియమిస్తున్నారని, టీటీడీ హుండీ మీద వచ్చిన ఒక శాతం ఆదాయాన్ని దారి మళ్ళించే ప్రయత్నం చేశారని ఆగ్రహించారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు తీసుకువచ్చిన ఘనత ప్రధాని మోడీకే దక్కుతుందన్నారు. ఎస్సీ వర్గీకరణపై ప్రధాని మోదీకి స్పష్టత ఉందన్నారు. తొమ్మిదిన్నరేళ్ళలో అనినీతిరహిత పాలన చేసిన మోదీ దేశంలో ప్రధాని మోదీ సుపరిపాలన అందిస్తుంటే రాష్ట్రంలో అధికార పార్టీ స్వపరిపాలన చేస్తుందని కొనియాడారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement