Sunday, April 28, 2024

VZNM: పుంగనూరు ఘటన దురదృష్టకరం.. మంత్రి బొత్స

పుంగనూరు ఘటన దురదృష్టకరమని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. విజయనగరంలో ఆయన మాట్లాడుతూ…. ఎంతో అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు అలా వ్యవహరించకూడదన్నారు. ఎవరైనా చట్టాలను గౌరవించాలన్నారు. ప్రతిపక్షంలో ఉన్నాం, ఎలాగైన వ్యవహరిస్తాం, మాట్లాడతాం అంటే కుదరదన్నారు. చంద్రబాబు దుర్భుద్దితో వ్యవహరిస్తున్నారన్నారు. ఇలాంటి చర్యలు పునరావృతం కాకూడదని కోరుకుంటున్నానన్నారు. మంత్రి రామచంద్రారెడ్డి, వారి అనుచరులు రెచ్చగొడితే, అనుభవం ఉన్న నాయకుడిగా చంద్రబాబు బుద్ధి ఏమైందని అన్నారు. చట్టవ్యతిరేకంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తమ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement