Sunday, April 28, 2024

PSLV-C55 రాకెట్ ప్రయోగం విజయవంతం

సూళ్లూరుపేట(శ్రీహరికోట) : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ శ్రీహరికోట నుంచి పీఎస్ఎల్వీ- సీ55 ని నింగిలోకి పంపింది. ఈ రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. పీఎస్‌ఎల్‌వీ సీరిస్‌లోని 58 రాకెట్‌ పీఎస్‌ఎల్‌వీ -సీ55 ద్వారా ఈ ప్రయోగాన్ని విజయవంతంగా చేపట్టింది. సింగపూర్‌కు చెందిన 741 కిలోల బరు వున్న టెలియోస్‌ -2తో పాటు మరో 16 కిలోల లూమిలైట్‌ ఉపగ్రహాన్ని నింగిలోకి తీసుకెళ్లింది. అంత్యంత జాగ్రత్తగా పూర్తిస్థాయిలో ఈ ప్రయోగాన్ని విజయవంతం చేసేదిశగా శాస్త్రవేత్తలు నింగిలోకి పంపారు. రెండు సింగపూర్ ఉపగ్రహాలను ఇస్రో నింగిలోకి పంపింది. సింగపూర్ కు చెందిన 741 కిలోల టెలియోస్-02 కక్ష్యలోకి ప్రవేశపెట్టింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement