Wednesday, May 1, 2024

కారుమంచిలో రెచ్చిపోయిన వైసీపీ వ‌ర్గీయులు

గుంటూరు జిల్లా శావల్యాపురం మండలం కారుమంచిలో వైసీపీ వర్గీయులు రెచ్చిపోయారు. టీడీపీ వర్గీయుల ఇళ్ల పై బీరు సీసాలు, రాళ్లు, కర్రలతో మూకుమ్మడిగా దాడి చేశారు. సీసీ కెమెరాలు ధ్వంసం చేసి మరీ వైసీపీ వర్గీయులు దాడికి పాల్పడ్డారు. పోలీసులకు టీడీపీ వర్గీయులు పిర్యాదు చేశార‌ని, అయినా పోలీసులు స్పందించలేదు. జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పారా హైమవతి విజయం సాధించడంతో జీర్ణించుకోలేకనే వైసీపీ వర్గీయులు అర్ధరాత్రి దాడికి పాల్పడ్డారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement