Wednesday, May 15, 2024

Protest – కాంతితో క్రాంతి కార్య‌క్రమానికి టిడిపి పిలుపు

అమరావతి: మరో వినూత్న నిరసనకు టిడిపి పిలుపునిచ్చింది. శ‌నివారం నాడు ‘కాంతితో క్రాంతిస‌ పేరిట కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించింది. ఈ మేర‌కు నారా లోకేష్ ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేస్తూ, ప్రగతి వెలుగులు పంచే చంద్రుడుని ఫ్యాక్షన్ పాలకులు చీకట్లో నిర్బంధించారని ధ్వజమెత్తారు. ఈనెల 7న రాత్రి 7 గంటల నుంచి 7.05 నిమిషాల వరకూ ఇళ్లలో లైట్లు ఆపి దీపాలు, కొవ్వొత్తులు, మొబైల్ టార్చ్ లైట్ వెలిగించి.. వాహనాల లైట్లు బ్లింక్ చేయడం ద్వారా తెదేపా అధినేత చంద్రబాబుకు సంఘీభావం తెలపాలని పిలుపునిచ్చారు. ‘బాబుతో నేను’ అంటూ వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయాలని కోరారు. వాకిళ్లు, బాల్కనీలు, వీధుల్లోకి వచ్చి దీపాలు, కొవ్వొత్తులు, మొబైల్ టార్చ్‌లు, టార్చ్ లైట్లు.. వీటిలో వేటినైనా తీసుకుని వెలుగు చూపించాలని లోకేష్ సూచించారు.

చీకటిని తరిమికొట్టే క్రాంతి మొదలైంది – బ్ర‌హ్మ‌ణి..

చంద్రబాబు అనే చైతన్యాన్ని నిర్బంధించి తిరుగులేదని కొందరు అనుకుంటున్నారని. కానీ రాష్ట్రంలో చీకటిని తరిమికొట్టే క్రాంతి మొదలైందని వారికి తెలీదని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ సతీమణి బ్రాహ్మణి అన్నారు. చంద్రబాబు అరెస్ట్‌ తదనంతర పరిణామాల నేపథ్యంలో ‘కాంతితో క్రాంతి’ నిరసన కార్యక్రమానికి ఆ పార్టీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై బ్రాహ్మణి ట్వీట్‌ చేశారు.

”మన రాష్ట్రాన్ని, మన భవిష్యత్తును చీకటి చేసి.. దాన్ని కనిపెట్టకుండా మనల్ని కళ్లు మూసుకో అంటున్నారు కొందరు. చంద్రబాబు అనే చైతన్యాన్ని నిర్బంధించి తిరుగులేదు అనుకుంటున్నారు. కానీ రాష్ట్రంలో చీకటిని తరిమికొట్టే క్రాంతి మొదలైందని వాళ్లకు తెలీదు. మనమెందుకు చీకట్లో ఉండాలి?అక్టోబర్‌ 7న రాత్రి 7 గంటలకు ఇళ్లలో లైట్లు ఆఫ్‌ చేసి బయటకు వచ్చి 5 నిమిషాల పాటు దీపాలు, సెల్‌ఫోన్‌ టార్చ్‌, కొవ్వొత్తులు వెలిగిద్దాం. రోడ్డుపై ఉంటే వాహనాల లైట్లు బ్లింక్‌ చేద్దాం” అని బ్రాహ్మణి పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement