Wednesday, May 8, 2024

AP: దేవుని కడపను దర్శించుకున్న ప్రెస్ అకాడమీ ఛైర్మెన్

కడప ప్రతినిధి, ప్రభ న్యూస్ (నవంబర్ 19) : దేవుని కడపలోని శ్రీ లక్ష్మీ వెంకటశ్వర స్వామి వారిని ఆంధ్ర ప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు కుటుంబ సభ్యులతో కలిసి దర్శనం చేసుకున్నారు. ఆదివారం దేవుని కడప ఆలయం వద్ద ఆంధ్ర ప్రదేశ్ ప్రెస్ అకాడమీ చైర్మన్ దంపతులు, కుటుంబ సభ్యులకు వేద పండితులు, దేవస్థాన సిబ్బంది, అధికారులు ఆలయ మర్యాదలతో సాంప్రదాయం ప్రకారం స్వాగతం పలికారు.

అనంతరం దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటశ్వర స్వామి వారికి పుష్పార్చన,సంకల్పనార్చన తదితర ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు వేద మంత్రాలు పలుకగా అర్చకులు ఆశీర్వచనాలు, తీర్థప్రసాదాలు అందించారు.అనంతరం పద్మావతి అమ్మవారికి కుంకుమార్చన పూజలు నిర్వహించి వేద ఆశీర్వాదం చేశారు. అనంతరం రోడ్డు మార్గంలో హైదరాబాదుకు బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో డివిజనల్ పిఆర్ఓ సునీల్ సాగర్, రెవెన్యూ అధికారులు ప్రసాద్, విద్యాసాగర్,తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement