Monday, May 6, 2024

వైయస్‌ఆర్‌ జలకళ..

తర్లుపాడు: రైతన్న మోములో వైయస్‌ఆర్‌ జలకళ వెలుగులు నింపుతోందని సర్పంచ్‌ యం.శిఖామని పేర్కొన్నారు. మార్కాపురం నియోజకవర్గ పరిధిలోని కలులజువ్వలపాడు గ్రామ పంచాయితీలో వైయస్‌ఆర్‌ జలకళ ద్వారా 100వ బోరును వేశామన్నారు. ఈ సంధర్భంగా సర్పంచ్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతన్నలకు మేలు చేయాలనే ఉద్దేశంతో వారు అప్పులపాలు కాకుండా కాపాడాలనే ఈ పథకం ప్రవేశపెట్టారన్నారు. యంపిడిఓ ఎస్‌.నరసింహులు మాట్లాడుతూ ఈ పథకం ద్వారా ఎంతోమంది రైతన్నలకు మేలు జరుగుతుందని బుధవారం నాటికి జలకళ ద్వారా 100 బోర్లను వేయడం జరిగిందని, ఈ పథకం ద్వారా బోర్లు వేయడం పట్ల పలువురు రైతన్నలు, గ్రామస్థులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌, యంపిడిఓతో పాటు పి.డి శీనారెడ్డి, ఏపిడి మధుసూదన్‌రెడ్డి,యంపిటిసి తిరుపతిరెడ్డి, ఇన్‌చార్జ్‌ యం.కొండారెడ్డి, నాయకులు, రైతులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement