Monday, May 6, 2024

ఒంగోలులో డ్ర‌గ్స్ విక్ర‌యిస్తున్న‌ ఇద్ద‌రు అరెస్ట్

ఒంగోలులో డ్ర‌గ్స్ విక్ర‌యిస్తున్న ఇద్ద‌రిని పోలీసులు అరెస్ట్ చేశారు..చెన్నై నుంచి తెచ్చి ప్యాకింగ్ చేసి ఇతర రాష్ట్రాలకు డ్ర‌గ్స్ సరఫరా చేస్తున్నట్లు తెలిసింది. ప్రకాశం జిల్లా ఒంగోలులోని ఇండస్ట్రియల్‌ ఎస్టేట్‌లో నిషేధిత మత్తు పదార్థాల తయారీ స్థావరంపై చెన్నై పోలీసులు దాడి చేశారు. డ్ర‌గ్స్ విక్ర‌యిస్తున్న ఇద్ద‌రిని అరెస్ట్ చేశారు. పారిశ్రామికవాడలోని గోడౌన్‌ వద్దకు వెళ్లి తనిఖీ చేయగా.. మత్తు పదార్థాలు తయారు చేస్తున్నట్లు గుర్తించారు. గోడౌన్​ను సీజ్​ చేశారు. అక్కడ నిషేధిత పదార్థమైన మెథాంఫెటమైన్‌ అనే డ్రగ్‌ను గుట్టుగా తయారు చేసి ప్యాకెట్ల రూపంలో ఇతర రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement