Thursday, April 25, 2024

జగన్ అక్రమాస్తుల కేసుపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి అక్రమాస్తుల కేసులో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణ రాజు వేసిన పిల్‌పై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. రఘురామ పిల్‌కు నంబర్‌ కేటాయించాలని, పిల్‌ విచారణ అర్హతను తేల్చాల్సి ఉందని హైకోర్టు తెలిపింది. ఈక్రమంలో రిజిస్ట్రీ తెలిపిన అభ్యంతరాలను హైకోర్టు సీజే ధర్మాసనం తోసిపుచ్చింది. కాగా, జగన్‌ కేసులో పలు అంశాలపై సీబీఐ, ఈడీ విచారణ జరపలేదని రఘురామ ఇటీవల పిల్‌ దాఖలు చేశారు. పలు అభ్యంతరాలను కారణంగా చూపుతూ హైకోర్టు కార్యాలయం ఆ పిల్‌ను అనుమతించని విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement