Monday, April 29, 2024

పోలీసుల వేధింపులు తాళలేక టిడిపి కార్యకర్త ఆత్మహత్య

శ్రీకాకుళం జిల్లా మందస మండలం పొత్తంగి గ్రామానికి చెందిన టిడిపి కార్యకర్త కోన వెంకట్ రమణ పోలీసులు వేధింపులు తాళలేక హత్యకు పాల్పడ్డాడు. టెక్కలి వైసీపీ నాయకులపై కోన వెంకటరమణ సోషల్ మీడియాలో ఆరోపణలు చేయడంతో ఇటీవల పోలీసులు వెంకట రమణ గ్రామానికి వెళ్లి వారి కుటుంబీకులకు బెదిరింపులు చేపట్టడంతో మనస్థాపానికి గురై వెంకటరమణ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడని కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. విషయం తెలుసుకున్న టిడిపి రాష్ట్ర కార్యదర్శి గౌతు శిరీష టిడిపి నాయకులతో కలిసి పలాస హాస్పిటల్ వద్ద పోలీసుల తీరుకు నిరసనగా ధర్నా నిర్వహించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement