Monday, April 29, 2024

Breaking: సింగరాయకొండలో ఉద్రిక్తత

ప్రకాశం జిల్లా సింగరాయకొండలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. రౌడీషీటర్ మృతికి కార‌ణ‌మైన లారీని గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు ద‌గ్ధం చేశారు. లారీ వెనుక నుంచి ఢీకొన‌డంతో రౌడీషీట‌ర్ ప‌సుపులేటి ర‌వితేజ మృతిచెందాడు. అది హ‌త్యేనంటూ మృతుడి కుటుంబ స‌భ్యులు పీఎస్ వ‌ద్ద ఆందోళ‌న చెందుతున్నారు. పాత‌క‌క్ష‌ల‌తో అంబ‌టి ప్ర‌సాద్, అత‌ని కుమారులే హ‌త్య చేశార‌ని ఆరోపించారు. ఆందోళ‌న‌కారులు సింగ‌రాయ‌కొండ‌లో దుకాణాల‌ను మూసివేయిస్తున్నారు. దీంతో ఉద్రిక్త‌త‌లు చోటుచేసుకోకుండా భారీగా మొహ‌రించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement