Tuesday, May 7, 2024

ఉపాధ్యాయుల సేవలు మరువలేం..

యర్రగొండపాలెం : బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయుల సేవలు మరువలేనివని యంఈఓ, సర్పంచ్‌లు పేర్కొన్నారు. మండలంలోని అమానిగుడిపాడు మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాలలో బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులకు హెచ్‌యం పులి విజయ అధ్యక్షతన ఆత్మీయ సన్మాన వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మండల విద్యాశాఖాధికారి పి.ఆంజనేయులు , గ్రామ సర్పంచ్‌ వైదన దివ్యలు హాజరయ్యారు. ఈ సంధర్భంగా బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులనుద్దేశించి యంఈఓ మాట్లాడుతూ ఉపాధ్యాయుల సేవలు మరువలేనివని, వారు పాఠశాలలో నిర్వహించి న విద్యాకార్యక్రమాలను, విద్యార్థులకు ఆటపాటల ద్వారా విద్యనేర్పిన తీరుతెన్నులను గుర్తుచేసి ఉపాధ్యాయ వర్గంలో వారు ఆణిముత్యాలని ప్రశంసల జల్లు కురిపించారు. వారు ఎక్కడికి వెళ్లినా ఇలాఏ మన్న్నలు పొందాలన్నారు. సర్పంచ్‌ వైదన దివ్య మాట్లాడుతూ ఉపాధ్యాయుల సేవలు మరువలేనివని విద్యార్థులకకు మంచి విద్యాబుద్దులు నేర్పారని ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ సభలో గ్రామ పెద్దలు చిట్యాల వెంగళరెడ్డి, యంపిటిసి, హెచ్‌యం యం.లక్ష్మారెడ్డి, ఎస్‌ఎమ్‌సి చైర్మన్‌ కోటయ్య, వై. లక్ష్మయ్య, లక్ష్మీనారాయణ, పాఠశాల సిబ్బంది గ్రామంలోని పాఠశాలలోని ఉపాధ్యాయులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement