Wednesday, May 1, 2024

సీఎం చిత్రపటానికి పాలాభిషేకం..

కొనకనమిట్ల : విఆర్‌ఓలకు డిడిఓలుగా అధికారాలు కల్పిస్తూ జి.ఓను సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జారీ చేసినందుకు సియం చిత్రపటానికి విఆర్‌ఓల ఆధ్వరర్యంలో తహసీల్దార్‌ డి. భాగ్యలక్ష్మి పాలాభిషేకం చేశారు. స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వం విఆర్‌ఓలకు కల్పించిన డిడిఓ అధి కారాలను సద్వినియోగం చేసుకుని ప్రజల మన్ననలు పొందాలన్నారు. విఆర్‌ఓల సంఘం జిల్లా కోశాధికారి జానయ్య మాట్లాడుతూ ప్రభుత్వం విఆర్‌ఓలపై ఉన్న నమ్మకంతో డిడిఓ అధికారాలను కట్టబెట్టిందని, సియం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కృషిని ఆయన అభినందించారు.ఈ కార్యక్రమంలో విఆర్‌ఓలు దిలీప్‌, రమేష్‌, సురేష్‌, డానియెల్‌, బొర్రయ్య, శివకోటేశ్వరరావు, సంతోష్‌కుమార్‌, విఆర్‌ఏలు , సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement