Saturday, May 18, 2024

పొగాకు రైతుకు గిట్టుబాటు ధర..

కందుకూరు టౌన్‌ : పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని ప్రకాశంజిల్లా కందుకూరు మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ దివి శివరాం వ్యాపార సంస్థల ప్రతినిధులకు విజ్ఞప్తిచేశారు. పట్టణంలోని 27 నెంబర్‌ పొగాకు వేలం కేంద్రంలోని పరిస్థితులను పరిశీలించేందుకు దివి శివరాం వచ్చారు. వేలం జరుగుతున్న తీరును నిశితంగా గమనించారు. నాణ్యమైన పొగాకుతోపాటు ఇతర గ్రేడ్‌లకు లభిస్తున్న ధరలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వ్యాపార సంస్థల ప్రతినిధులతో మాట్లాడిన దివి శివరాం పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించి వారి జీవనోపాధికి సహకరించమని విజ్ఞప్తిచేశారు. ఇదే సమయంలో ఈ ప్రాంతవాసి అయిన పొగాకు బోర్డు వైస్‌ ఛైర్మన్‌ శివారెడ్డి కూడా వేలం కేంద్రానికి వచ్చి ఉన్నారు. దివి శివరాంతోపాటు రైతు సంఘ ప్రతినిధి తాడికొండ రమణయ్య కూడా పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement