Friday, May 17, 2024

కందుకూరులో కరోనా కలకలం..

కందుకూరు : ఇటీవల కొంత కాలం ప్రశాంతంగా ఉన్న ప్రకాశంజిల్లా కందుకూరు పట్టణంలో కరోనా మహమ్మాది మళ్ళీ కలకలం రేపింది. పెద్దబజారులోని ఓ యువకుడికి కోవిడ్‌ పాజిటివ్‌ తేలడంతో పట్టణ ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిగా ఇంటి దగ్గర నుండే పనిచేస్తున్న ఆ యువకుడు సినిమాకు వెళ్ళాడని తెలిసింది. ఆ తరువాత నుండి అనారోగ్యానికి గురి కావడంతో అనుమానం వచ్చి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నాడు. అతని అనుమానం నిజమైంది. మంగళవారం వెల్లడైన నివేదికలో కోవిడ్‌ పాజిటివ్‌ అని నిర్ధారణ అయింది. దాంతో ఆ ప్రాంతమంతా మున్సిపల్‌ సిబ్బంది శానిటైజ్‌ చేశారు. లింగసముద్రం మండలంలోని 55 ఏళ్ళ మహిళ కూడా పాజిటివ్‌ అని నిర్ధారణ కావడంతో ఆమెను ఒంగోలులోని రిమ్స్‌కు తరలించినట్లు వైద్యాధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement