Thursday, April 25, 2024

ప్రజల సమస్యలను తెలుసున్న ఎమ్మెల్యే ..

కందుకూరు : మండల కేంద్రమైన ఉలవపాడులో కందుకూరు శాసనసభ్యులు మానుగుంట మహీధర్‌ రెడ్డి మండల స్థాయి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలను పరిష్కరించడంలో మండలస్థాయి అధికారులు చొరవ చూపాలని ఎట్టి పరిస్థితుల్లో ప్రజల సమస్యల పరిష్కారం కొరకు ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితికి చరమగీతం పాడాలని ఆయన తెలిపారు. మండలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందుకు వెళ్తున్న తరుణంలో ప్రజల సమస్యలు పరిష్కరించడంలో ముందు ఉండాల న్నారు. అదే విధంగా చాకిచర్ల ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది పనితీరుపై ఆయన సంతృప్తి వ్యక్తంచేశారు. మండల పరిధిలో తాగునీరు, కరెంటు, విద్యా, వైద్యం వంటి మౌళిక విషయాలపై ఆయన లోతుగా సమీక్ష నిర్వహించి అధికారులకు దిశానిర్ధేశం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ రవికుమార్‌, విద్యుత్‌ శాఖ ఏఇ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement