Monday, May 6, 2024

ప్రకాశం జిల్లాలో కంపించిన భూమి.. ఇళ్లల్లో నుంచి పరుగులు తీసిన జనం

ఇటీవలి కాలంలో తెలుగు రాష్ట్రాల్లో వరుసగా భూకంప ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాలో భూమి కంపించింది. ముండ్లమూరు గ్రామంలో ఆదివారం ఉదయం రెండు సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో భయాందోళనకు గురైన గ్రామస్థులు ఇళ్లల్లో నుంచి బయటకు పరుగులు తీశారు. భూమి కంపించడానికి ముందు భారీ శబ్దం వినిపించిందని కొంతమంది చెప్పారు. ఆ తర్వాత కాసేపటికే భూమి కంపించడంతో ఇంట్లో నుంచి బయటకు వచ్చామని వివరించారు. ఈ ఘటనతో గ్రామస్థులలో భయాందోళనలు నెలకొన్నాయి. ఈ ఏడాది మార్చిలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని కర్నూల్ జిల్లా తుగ్గలి మండలం రాతసలో భూమి కంపించింది. ఫిబ్రవరిలో ఎన్టీఆర్ జిల్లా, పల్నాడు జిల్లాల్లో పలుచోట్ల భూకంపం సంభవించింది. అదేవిధంగా తెలంగాణ‌లోని సూర్య‌పేట‌లో రెండు నెల‌ల క్రితం భూమి కంపించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement