Tuesday, April 30, 2024

జగనన్నతోనే సంక్షేమం, అభివృద్ధి : మంత్రి రోజా

జగనన్న ద్వారానే సుపరిపాలన సంక్షేమం అభివృద్ధి సాధ్యమవుతుందని పర్యాటక సాంస్కృతిక వ్యవహారాల, యువజన క్రీడా శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నగరి మున్సిపాలిటీ పరిధిలో జ‌రిగింది. మంత్రి రోజాకు ప్రజలు బ్రహ్మ రథం పట్టారు. ఈ సందర్భంగా మంత్రి రోజా మాట్లాడుతూ.. రాబోయే 2024లో మరల వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా గెలిపించుకుందాం అని తెలియజేశారు. ఈ సందర్భంగా వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ అలాగే ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని అర్హత ఉండి పథకాలు అందని లబ్ధిదారులకు వెంటనే ఆ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement