Thursday, May 9, 2024

కరోనా వ్యాక్సినేషన్‌పై అవగాహన..

తర్లుపాడు: 45 సం.లు దాటిన ప్రతీ ఒక్కరు కరోనా వ్యాక్సిన్‌ తీసుకోవాలని వైద్యాధికారి కె.వంశీకృష్ణ తెలిపారు. స్థానిక తర్లుపాడు సచివాలయం, ఎస్సీపాలెం సామాజిక భవనం వద్ద ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సంధర్భంగా వైద్యాధికారి మాట్లాడుతూ 45-60 సం.ల మధ్య వయసు గల వారందరూ కరోనా వ్యాక్సిన్‌ వేయించుకోవాలని, ప్రస్తుతం కరోనా సెకండ్‌ వేవ్‌ ఉందని కావున ప్రతీ ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని భౌతికదూరాన్ని పాటిస్తూ మాస్కు ధరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హెల్త్‌ అసిస్టెంట్‌ సుధాకర్‌, ఎఎన్‌ఎమ్‌లు, వాలంటీర్లు, ఆశ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement