Saturday, May 4, 2024

దర్శి ఎమ్మెల్యే కుమారుడి వివాహ రిసెప్షన్ కు హాజరైన సీఎం జగన్

ప్రకాశం జిల్లా : దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌ కుమారుడి వివాహ రిసెప్షన్‌కు ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ హాజ‌ర‌య్యారు. ప్రకాశం జిల్లా పర్యటనకు విచ్చేసిన ఆయ‌న‌ వివాహ రిసెప్షన్ వేడుక‌లో పాల్గొని నూతన వధూవరులు రోహిత, రాజీవ్ లకు శుభాకాంక్షలు తెలిపి వారిని ఆశీర్వదించారు. ఈ వివాహ రిసెప్షన్ కు మంత్రి ఆదిమూలపు సురేశ్, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా హాజరయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement