Thursday, May 2, 2024

బకాయిరాయుళ్ళ భరతం పడతాం..

కందుకూరు టౌన్‌ : ప్రకాశంజిల్లా కందుకూరు మున్సిపాలిటీ పరిధిలోని ఆస్తి పన్ను బకాయిదారుల భరతం పట్టేందుకు యంత్రాంగం సిద్ధమైంది. గడచిన కొన్నేళ్ళుగా ఆస్తిపన్ను చెల్లించకుండా ఘరానాగా తప్పించుకు తిరుగుతున్న వారి పట్ల కఠినంగా వ్యవహరించడానికి రంగం సిద్ధం అయింది. భారీగా పన్ను బకాయిదారుల జాబితా సిద్ధం చేసిన అధికారులు ఆఖరి ప్రయత్నంగా వారందరినీ వ్యక్తిగతంగా కలిసి ఈ నెలాఖరులోగా బకాయిలు చెల్లించాలని హెచ్చరికలు చేశారు. లేనిపక్షంలో చట్టపరమైన అన్నీ చర్యలు ఎదుర్కోక తప్పదని స్పష్టంచేశారు. అందులో భాగంగా మున్సిపల్‌ కమీషనర్‌ మనోహర్‌ ఇతర అధికారులు బకాయిదారులను కలిశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement