Wednesday, May 1, 2024

Prakasam: పైకి పత్త్యాపారం.. లోప‌లికెళ్లి చూస్తే షాక్ అవ్వాల్సిందే..

Ganja Matter: గంజాయి వ్యవహారం ఏపీ, తెలంగాణ‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఏపీలో డ్రగ్స్ వ్యవహారంపై రాజకీయ రచ్చ కొన‌సాగుతోంది.. తెలంగాణలో కూడా పలు డ్రగ్స్ లింకులు తెరపైకి వస్తున్నాయి. దీంతో ఇరు రాష్ట్రాల సీఎంలు డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపాలని పిలుపునిచ్చారు.

తాజాగా ప్రకాశం జిల్లాలో గంజాయి కలకలం చెలరేగింది. ఎస్‌ఈబీ అధికారుల దాడుల్లో షాకింగ్ దృశ్యం వెలుగుచూసింది. పత్తి చేను మాటున గుట్టుగా గంజాయి సాగు వ్యవహారం వెలుగుచూసింది. ఊహించని విధంగా పత్తి చేలో గంజాయి సాగు స్థానికులను షాక్‌కు గురిచేసింది.

గంజాయి సాగు చేస్తున్నట్లు ఎస్ఈబీ అధికారులకు సమాచారం అందడంతో దాడులు నిర్వహించారు. చెంచమ్మ అనే మహిళ గ్రామ శివారుల్లో గంజాయి సాగు చేస్తున్నట్లు గుర్తించారు. బేస్తవారిపేట మండలంలోని చెన్నుపల్లికి చెందిన లక్కమనేని చెంచమ్మ తన పొలంలో పత్తి సాగు చేస్తున్నారు.

పక్కా ప్లాన్ ప్రకారం.. ఎవరూ గుర్తించకుండా అందులో అక్కడక్కడ గంజాయి మొక్కలు నాటారు. విశ్వసనీయ వర్గాల నుంచి.. సమాచారం రావడంతో ఎస్‌ఈబీ అధికారులు గురువారం దాడిచేశారు. చెంచమ్మ పొలంలో నాటిన 310 గంజాయి మొక్కలను గుర్తించి పీకి వేశారు.

నిందితురాలిని అదుపులోకి తీసుకొని.. కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేస్తున్నారు. ఆమెకు ఎవరెవరితో లింకులున్నాయో అనేదానిపై కూపీ లాగుతున్నారు. అసలు ఇలా గంజాయి సాగు చెయ్యమని ఎవరు చెప్పారు. గతంలో ఎన్నిసార్లు ఇలా చేశారు అనే విషయాలపై విచారణ జరుపుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement