Friday, May 10, 2024

విద్యార్థులతో కలిసి కలెక్టర్ మధ్యాహ్న భోజనం

ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం దరిమడుగు గ్రామంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో కలెక్టర్‌ ప్రవీణ్‌ కుమార్‌ బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా విద్యార్థులతో కలిసి కలెక్టర్‌ మధ్యాహ్న భోజనాన్ని తిన్నారు. అనంతరం విద్యార్థులతో ముచ్చటించారు. పాఠశాలలో అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement