Saturday, April 27, 2024

Prajagalam – నేడు ఉమ్మడి అనంతపురం జిల్లాలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం

టీడీపీ అధినేత చంద్రబాబు నేడు ఉమ్మడి అనంతపురం జిల్లాలో పర్యటన చేయనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రాప్తాడు, బుక్కరాయసముద్రం, కదిరి ప్రాంతాలలో ప్రజాగళం పేరిటన ఏర్పాటు చేస్తున్న బహిరంగ సభల్లో ప్రసంగించనున్నారు చంద్రబాబు.

ఇందులో భాగంగా ఉదయం మదనపల్లి బీటీ కళాశాల మైదానం నుంచి హెలికాప్టర్ లో బయలుదేరి ప్రసన్ననాయపల్లి అయ్యప్ప స్వామి దేవాలయం దగ్గర ల్యాండ్ అవుతారు.. అక్కడ నుంచ గి రోడ్డు మార్గం రాప్తాడు బస్టాండ్ కు చేరుకోనున్నారు. అక్కడే జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొనబోతున్నారు. ఆ తర్వాత 2:00 గంటల వరకు విశ్రాంతి తీసుకుంటారు.

మధ్యాహ్న భోజనం తర్వాత 02:00 నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి 02:30 గంటలకు బుక్కరాయసముద్రం సబ్ స్టేషన్ సెంటర్ కు చేరుకుంటారు. అక్కడ 02:30 నుండి 04:00 వరకు బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొనబోతున్నారు. ఆ సభ తర్వాత 5:10 నిమిషాలకు ప్రసన్నాయపల్లి నుండి హెలికాప్టర్ లో బయలుదేరి శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలోని ఎస్టీఎస్ఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో దిగుతారు. ఆ తర్వాత నగరంలోని మహిళా కళాశాల కుడలిలో 05:50 నిమిషాల నుంచి 7:30 వరకు బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ తర్వాత ఆయన మళ్ళీ తిరిగి మదనపల్లికి చేరుకోనున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement