Saturday, April 27, 2024

Kurnul – ‘మేమంతా సిద్ధం’ – నేటి జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న షెడ్యూల్ …

ఇవాళ, రేపు ఉమ్మడి కర్నూలు జిల్లాలో సీఎం జగన్ బస్సుయాత్ర కొనసాగనుంది. ఈ సందర్భంగా ఆళ్లగడ్డ లో ముఖ్యనేతలు, మేధావులతో మాట్లాడనున్నారు సీఎం జగన్. కాగా, రెండో రోజు మేమంత సిద్ధం బస్సు యాత్ర నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నైట్ హాల్ట్ ప్రాంతం నుంచి నేటి ఉద‌యం ప్రారంభ‌మైంది. ఆళ్లగడ్డ నుంచి బయలుదేరి నల్లగట్ల, బత్తలూరు, ఎర్రగుంట్ల చేరుకొని గ్రామస్థులతో ముఖాముఖి కార్యక్రమంలో జ‌గ‌న్ పాల్గొన్నారు.. అనంత‌రం . ఆ తర్వాత గోవిందపల్లి మీదుగా ప్రయాణించి చాబోలు శివారులోని రైతు నగరం వద్ద మధ్యాహ్న భోజన విరామం తీసుకుంటారు.

ఇక, ఆ తర్వాత నూనేపల్లి మీదుగా నంద్యాల చేరుకుని సాయంత్రం 4 గంటలకు గవర్నమెంట్‌ ఆర్ట్స్‌ కాలేజీ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి జగన్ ప్రసంగిస్తారు. అత‌ర్వాత‌ పాణ్యం, సుగాలిమిట్ట, హుస్సేనాపురం, ఓర్వకల్, నన్నూర్, పెద్దటేకూరు, చిన్న కొట్టాల, కె.మార్కాపురం క్రాస్, నాగలాపురంలో ప్రజలతో మమేకమవుతూ గూడూరు మండలం నాగులాపురంలో సీఎం జగన్ రాత్రికి బస చేయనున్నారు. ఇక, తొలి రోజు ఉమ్మడి జిల్లాలో 5 నియోజకవర్గాల్లో 131 కిలో మీటర్ల మేర జగన్ బస్సు యాత్ర కొనసాగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement