Saturday, April 27, 2024

Praja Galam – కుప్పం నుంచి బెంగళూర్ కు గంటలో వెళ్లేలా రోడ్డు వేస్తా – చంద్ర బాబు

కుప్పం, మార్చి 25 (ప్రభ న్యూస్ ): కుప్పం నియోజకవర్గం ను బెంగళూరు తో అనుసంధానం చేస్తానని సజ్జ పురం నుండి కుప్పం వరుకు నాలుగు వరసుల రోడ్డు నిర్మించి కుప్పం నుండి కేవలం ఒక్క గంట లో బెంగళూరు కు చేరుకొనే విధంగా మన ప్రభుత్వం రాగానే చేస్తానని తెదేపా అధినేత చంద్రబాబు ప్రజాగళం కుప్పం సభలో తెలిపారు. కుప్పం పట్టణం బస్స్టాండ్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు హామీల వర్షం కురిపించారు. 8వ సారి కుప్పంలో లక్ష ఓట్ల మెజారిటీ తో గెలిపించాలని కోరుతూ 5 ఏళ్ళుగా కుప్పంలో దోపిడి జరిగిందన్నారు.పేదరికమే నా మతం బలహీనవర్గాలే నా ధైర్యం అని తెలిపారు.

కుప్పం అంటే చంద్రబాబు మీ ఆశీస్సులు కోసం వచ్చానని తెలిపారు. కుప్పం లో వైకాపా ప్రభుత్వ హయాంలో కుప్పం టీడీపీ‌ కార్యకర్తలు జైలుకు పోయినా జెండా వదలని సైనికులు అని తెలిపారు. ప్రతి నియోజకవర్గానికి ఒక మ్యానిఫెస్టో ఏర్పాటు చేస్తామని ఎన్నికలు ఎప్పుడు జరిగినా కుప్పం ప్రజలు సిద్దంగా ఉన్నారని తెలిపారు. కుప్పం అభివృద్ధికి అడ్డుపడ్డ వైసిపికి కుప్పంలో డిపాజిట్ రాదన్నారు.అన్న క్యాంటీన్ లు రద్దు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

పుంగనూరు నుండి పుడింగి కుప్పం వస్తాడు దోచుకోవడానికి ప్రజలు అప్రమత్తం గా ఉండాలని చంద్రబాబు తెలిపారు. కుప్పానికి నన్ను రానీయకుండా చేసి, కేసులు పెట్టారని,నాపైనే కుప్పంలో రౌడీఇజం చేశారని తెలిపారు. వందలాది మంది టీడీపీ నాయకులపై కేసులు పెట్టి జైల్లో పెట్టారు.అధికారాన్ని అడ్డం పెట్టుకుని రౌడి ఇజం చేస్తున్న రౌడీలకు వార్నింగ్ ఇస్తున్నా ఎన్నికలలో అక్రమాలు చేస్తే తెలుగుతమ్ముళ్లూ అడ్డుపడతారు జాగ్రత్త అని హెచ్చరించారు.

. సైకో ముఖ్యమంత్రి హంద్రీనీవా నీరు అంటూ హడావిడి చేశాడని డ్రామాలు, సినిమా సెట్టింగులతో కుప్పం ప్రజలను మోసం చేశారని తెలిపారు. కుప్పం రావడానికి సీఎం కు సిగ్గుండాలన్నారు. 90 శాతం హంద్రీనీవా కాలువ పూర్తి చేశాను, కుప్పానికి హంద్రీనీవా నీరు తీసుకువచ్చి అన్ని చెరువులు నింపుతాము పాలారు ప్రాజెక్టు పూర్తి చేస్తానాని తెలిపారు.కుప్పాన్ని అభివృద్ధి చేశాము, ప్రస్తుతం కుప్పానికి అన్యాయం చేశారు. గ్రానైట్ మాఫియా కుప్పానికి వచ్చింది,.

- Advertisement -

కేజీఎఫ్ తరహాలో గ్రానైట్ తవ్వేశారు అన్నీ లెక్కలు ఉన్నాయ్ వడ్డీతో సహా తీర్చుకుంటా అని హెచ్చరించారు. కుప్పంలో‌ లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపిస్తారా రాష్ట్రంలో అత్యధిక మెజారిటీ కుప్పంలోనే రావాలన్నారు.చంద్రబాబును ఓడిస్తాం కుప్పంలో గెలుస్తాం వైనాట్ 175 అంటున్నారు నేను అంటున్నా వైనాట్ పులివెందులా అని జగన్ నీకు ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు. బాబాయ్ ని గొడ్డలితో చంపినందుకా రాష్ట్రాన్ని రావణకాష్టం చేసినందుకా అని ప్రశ్నించారు.రాష్ట్రం లో సర్పంచులు, ఎంపిటిసీలు ఉచ్చవ విగ్రహాలు గా మారారు. మీకు నిధులు, విధులను అందిస్తా సహకరించండి అని చంద్రబాబు కోరారు.కుప్పం మున్సిపాలిటీలో అభివృద్ధి నిల్ పన్నులు‌ ఫుల్, కుప్పానికి అవుటర్ రింగ్ రోడ్,కుప్పం నియోజకవర్గానికి 100 కోట్ల నిధులు అందించి అభివృద్ధి చేస్తానాని హామీ ఇచ్చారు.

కోలార్ నుండి కుప్పం, రామకుప్పం మీదుగా తమిళనాడు‌కు హైవే వేస్తా, అలాగే బెంగుళూరు సిటీకి కుప్పాన్ని అనుసందానం చేసి నాలుగు వరుసల రోడ్డు ను సజ్జపురం నుండి కుప్పం వరుకు నిర్మాణం జరిగితే గంట లో చేరుకొవచ్చునని తెలిపారు. పెన్షన్ 4 వేలు ఇస్తాం,ధరలు‌ బాదుడు ఉండదు వ్యవస్థ నిర్వీర్యం ఉండదు ముస్లింలను రెచ్చగొడుతున్నారు ముస్లింలకు అండగా నిలిచిన పార్టీ టీడీపీనే చంద్రబాబు తెలిపారు.నియోజకవర్గానికి ఒక మ్యానిఫెస్టో ఏర్పాటు చేస్తాం. కుప్పం ప్రజల అభివృద్ధికి పరిశ్రమలు తీసుకువస్తా . కుప్పం యువత కు ఉద్యోగలు ఇస్తామని తెలిపారు. ఎన్ డి ఏ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే శాంతిపురం మండలంలోని రాళ్ళబూదుగూరు ను మండల కేంద్రం గా చేస్తామని అదేవిధంగా కుప్పం రూరల్ మండలం మల్లనూరు ను కొత్త మండలం గా చేస్తానని హామీ ఇచ్చారు.

అదేవిధంగా మల్లప కొండ, గుడివంక, కంగుంది కొండ, బెట్రాయ కొండ, ననియాలా తదితర ప్రాంతాలను పర్యాటక ప్రాంతం తయారు చేస్తానని చంద్రబాబు తెలిపారు. అలాగే కుప్పం పట్టణం లోని తిరుపతి గంగమ్మ దేవాలయం ను ఎంత ఖర్చు అయినా అందరూ సంతోషించే లాగా పునర్నిర్మాణం చేస్తామని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement