Sunday, April 28, 2024

టీడీపీ నేత నక్కా ఆనంద్ బాబు ఇంటి వద్ద హైడ్రామా

మాజీమంత్రి, టీడీపీ నేత నక్కా ఆనంద్ బాబు ఇంటి వద్ద సోమవారం రాత్రి హై డ్రామా చోటుచేసుకుంది. విశాఖలో గంజాయి రవాణాకు సంబంధించి ఆనంద్ బాబు… ప్రభుత్వంతో పాటు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్టిపై ఆరోపణలు చేశారు. దీనిపై నోటీసులు జారీ చేసేందుకు గుంటూరులోని ఆనంద్ బాబుకు ఇంటికి విశాఖ జిల్లా నర్సీపట్నం పోలీసులు వచ్చారు. గంజాయి రవాణాకు సంబంధించి ఆధారాలు ఇవ్వాలని పోలీసులు ఆనంద్ బాబును కోరారు. మీడియాలో ఏ ఆధారాలతో మాట్లాడారో చెబితే స్టేట్‌మెంట్‌ రికార్టు చేసుకుంటామని తెలిపారు. పోలీసుల నోటీసు తీసుకునేందుకు ఆనంద్‌బాబు నిరాకరించారు. దీంతో పోలీసులు మంగళవారం ఉదయం మళ్లీ వస్తామని చెప్పి వెళ్లారు.

అయితే, పోలీసుల తీరుపై ఆనంద్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ పోలీసులు వచ్చి గంజాయి స్థావరాలపై దాడి చేస్తే ఏపీ పోలీసులు ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఇది ఏపి పోలీసులకు అవమానమని, అదే విషయాన్ని మీడియా ముందు చెప్పానని ఆనంద్ బాబు పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: కేశినేని భవన్ లో చంద్రబాబు ఫొటో తొలగింపు.. నాని పార్టీ మారుతారా?

Advertisement

తాజా వార్తలు

Advertisement