Sunday, April 28, 2024

యాదాద్రికి కేసీఆర్.. ఆలయ పునఃప్రారంభ తేదీ ప్రకటించనున్న సీఎం

సీఎం కేసీఆర్ ఇవాళ యాదాద్రిని సందర్శించనున్నారు. హదరాబాద్ నుంచి ఉదయం 11.30 గంటలకు ఆయన బయలుదేరి యాదాద్రిలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి చేరుకుంటారు. ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలిస్తారు. ఆలయ పునఃప్రారంభ ముహూర్తాన్ని ఈ సందర్భంగా సీఎం ప్రకటిస్తారు. ఆలయ పునఃప్రారంభ ముహూర్తాన్ని ఇప్పటికే చినజీయర్‌స్వామి ఖరారు చేశారు. ఆలయ ప్రారంభం రోజున నిర్వహించే మహా సుదర్శన యాగం వివరాలు, తేదీలను సీఎం కేసీఆర్ ప్రక‌టించ‌నున్నారు.కాగా, సీఎం కేసీఆర్‌ పర్యటనకు ఎలాంటి అవాంతరాలు ఏర్పడకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. పోలీసులు కట్టుదిట్టమైన భద్రత నిర్వహించనున్నారు.

ఇది కూడా చదవండి: గుజరాత్ తోపాటు తెలంగాణ ఎన్నికలు: ముందస్తు ఎన్నికలపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Advertisement

తాజా వార్తలు

Advertisement