Sunday, April 28, 2024

భారీగా నాటు సారాని పట్టుకున్న పోలీసులు

శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం ఎమ్మెస్ పల్లి పంచాయతీ రాగు పురం గ్రామంలో 2500 లీటర్ల నాటుసారాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం జిల్లా ఎస్పీ రాధిక మీడియాకు వివరాలు వెల్లడించారు. ఒరిస్సాలోని గంగాపూర్ నుండి నాటుసారాను తీసుకువచ్చి ఎంఎస్ పల్లి పంచాయతీ పరిధిలోగల రాగు పురం కొండల్లో ప్యాకెట్లు తయారు చేస్తున్నారు. వాటిని పలు ప్రాంతాల్లో అమ్ముతున్నారు. పక్క సమాచారంతో దాడులు నిర్వహించామన్నారు. రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున సారాను పట్టుకున్నారని ఆమె తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement