Thursday, May 2, 2024

రంజాన్ విందులో పాల్గొన్న‌ మంత్రి తలసాని

రాష్ట్ర మంత్రి త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్ ఈరోజు రంజాన్ విందులో పాల్గొన్నారు. రంజాన్ పర్వదినం సందర్భంగా సనత్ నగర్ నియోజకవర్గ పరిధి బన్సీలాల్ పేట డివిజన్ బోయగూడ ముస్లిం బస్తీ వాసులు ఏర్పాటు చేసిన రంజాన్‌ విందుకు మంత్రి తలసాని హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను వారు విందుకు ఆహ్వానించారు. బస్తీ వాసుల కోరిక మేరకు మంత్రి మంగళవారం విందుకు హాజరై ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి వెంట కార్పొరేటర్ హేమలత తదితరులున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement