Wednesday, May 8, 2024

వీడిన మర్డర్ మిస్టరీ.. తల్లీకూతుళ్ల హత్య కేసును చేధించిన పోలీసులు

ప్రకాశం జిల్లాలో టంగుటూరులో సంచలనం రేపిన తల్లీకూతుళ్ల హత్య కేసును పోలీసులు చేధించారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. గతేడాది డిసెంబర్ 3న టంగుటూరులో తల్లీకూతుళ్లు శ్రీదేవి, శ్రీలేఖ దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. నిందితుల్ని కందుకూరుకు చెందిన పాత నేరస్తులు అక్కం శివకోటయ్య, కిషోర్‌లను అదుపులోకి తీసుకున్నారు. నిందితులు హత్యకు నాలుగు రోజులు రెక్కీ నిర్వహించినట్ల పోలీసులు దర్యాప్తులో తేల్చారు. బంగారం కోసమే హత్యలు చేసినట్లు ప్రాథమికంగా నిర్థారించారు. ఇద్దరి ఒంటిపై బంగారాన్ని దొంగలు ఎత్తుకెళ్లారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement