Saturday, May 18, 2024

ఏపీ మంత్రుల క‌మిటీ స‌మావేశం ప్రారంభం

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ఉద్యోగుల స‌మ‌స్యల‌పై చ‌ర్చించేందుకు ఆ రాష్ట్ర మంత్రుల క‌మిటీ స‌మావేశమైంది. కొద్దిసేప‌టి క్రితం ఈ స‌మావేశం ప్రారంభ‌మైంది. ఉద్యోగుల ప్ర‌తిపాద‌న‌ల‌తో ఆర్థిక‌శాఖ మీద ప‌డే భార్యంపై మంత్రుల క‌మిటీలో చ‌ర్చించ‌నున్నారు. అయితే ఈరోజు మ‌ధ్యాహ్నం 2గంట‌ల‌కు ఉద్యోగ సంఘాలతో మంత్రుల క‌మిటీ స‌మావేశం కానుంది. ఈ మ‌ధ్యాహ్నానికి స‌మ‌స్య పరిష్కార‌మ‌య్యేలా నిర్ణ‌యం తీసుకునే అవ‌కాశ‌ముంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement