Saturday, May 4, 2024

Flash: మాజీ మంత్రులు పల్లె, కాల్వ అరెస్ట్

అనంతపురం జిల్లాలో టీడీపీ సీనియర్ నేతలు, మాజీ మంత్రులు పల్లె రఘునాథ్ రెడ్డి, కాల్వ శ్రీనివాసులులను పోలీసులు అరెస్ట్ చేశారు. బుక్కరాయసముద్రం పోలీస్టేషన్ లో నిర్బంధించారు. పుట్టపర్తిలో స్మశానంలో హెల్త్ కేర్ క్లినిక్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ నేడు పుట్టపర్తి బందుకు టీడీపీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో పుట్టపర్తి బంద్ లో పాల్గొనేందుకు అమరావతి నుంచి పుట్టపర్తికి వస్తున్న పల్లె రఘునాథరెడ్డి, కాలవ శ్రీనివాసులును అదుపులోకి తీసుకున్నారు. అమరావతి నుంచి వస్తున్న ఇద్దరు నేతల వాహనాలను బుక్కరాయసముద్రంలో నిలిపివేశారు. వారిని అదుపులోకి తీసుకున్నారు. పుట్టపర్తిలో నిర్వహించే ఆందోళనకు టీడీపీ నేతలు వెళ్లకుండా పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement