Tuesday, May 7, 2024

కుప్పంలో హై టెన్షన్.. మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డిని అరెస్ట్

చిత్తూరు జిల్లా కుప్పంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కుప్పం మున్సిపాలిటీకి ఎన్నికలు సమీపిస్తుండడంతో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది.  మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అమర్నాథ్ రెడ్డితోపాటు.. టీడీపీ జిల్లా అధ్యక్షుడు పులివర్తి నానిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం రాత్రి 11 గంటలకు అరెస్టు చేశారు.

కుప్పంలో నామినేషన్స్ సందర్భంగా వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. 14వ వార్డు టీడీపీ అభ్యర్థి ప్రకాశ్‌ నామినేషన్‌ను ఫోర్జరీ సంతకాలతో ఉపసంహరించుకున్నట్లు చూపడంతో సోమవారం రాత్రి టీడీపీ శ్రేణులు కుప్పం మున్సిపల్‌ కార్యాలయాన్ని ముట్టడించారు. దీంతో మొత్తం 19 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు పోలీసులు. ఇందులో ఇద్దరినీ మాత్రమే అదుపులోకి తీసుకున్నారు. ఐపీసీ 143, 147,353, 427,149 సెక్షన్స్ కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement