Tuesday, May 7, 2024

Accdient: నందిగామలో ఆటో- కారు ఢీ..11 మందికి తీవ్ర గాయాలు

కృష్ణా జిల్లా నందిగామ మండలం మునగచర్ల సమీపంలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుమీద చనిపోయిన ఉన్న గేదేను తప్పించబోయి టాటా మ్యాజిక్ ఆటో కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 11 మందికి తీవ్రగాయాలయ్యాయి. జనగామ నుండి విజయవాడ దుర్గగుడికి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్షతగాత్రులను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement