Thursday, May 9, 2024

అమర్‌నాథ్‌ యాత్రలో ఏపీ వాసులు గల్లంతు..

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఐదుగురు భక్తులు అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్లి గల్లంతయ్యారు. అమర్ నాథ్ యాత్రకు వెళ్లి ఇంతవరకు ఆచూకీ అందని ఏపీ యాత్రికుల వివరాలను ప్రభుత్వం వెల్ల‌డించింది. ఇందులో విజయవాడకు చెందిన వినోద్ అశోక్, రాజమహేంద్రవరానికి చెందిన గునిశెట్టి సుధా, తిరుపతికి చెందిన బి.మధు, గుంటూరుకు చెందిన మేదూరు ఝాన్సీ లక్ష్మి, విజయనగరానికి చెందిన వానపల్లి నాగేంద్ర కుమార్ ల‌ ఫోన్ లు స్విచ్ ఆఫ్ కావడంతో పాటు ఆచూకీ తెలియడం లేదని ప్ర‌భుత్వం వెల్ల‌డించింది.

ఇంకా చాలా మంది ఏపీ వాసులు ఉన్నట్లు సమాచారం. అమర్‌నాథ్‌ యాత్రికుల వివరాలకు ఏపీ భవన్‌లో హెల్ప్‌లైన్‌ 011-23387089 ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. మీ వారు ఎవరైనా అమర్ నాథ్ యాత్రకు వెల్లి, వారి నుండి సమాచారం మీకు రాకపోతే మీ దగ్గరలో ఉన్న ప్రభుత్వ అధికారులకు గానీ, మీడియా వారికి వివరాలు తెల‌పాల‌ని సూచించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement