Sunday, April 28, 2024

Roja: చేతల ప్రభుత్వం గురించి పిచ్చికూతలు కూస్తే ప్రజలే బుద్ధి చెబుతారు…

సీఎం జగన్ చేస్తున్న సహాయక చర్యలు చూసి తెలుగు తమ్ముళ్లు ఓర్వలేకపోతున్నారని మంత్రి రోజా విమర్శించారు. మొగుడు కొట్టినందుకు కాదు… తోడికోడలు దెప్పినందుకు ఏడ్చింది అన్న చందంగా టీడీపీ నాయకుల పరిస్థితి ఉందని మంత్రి రోజా వ్యంగ్యం ప్రదర్శించారు.

అందుకే ఇష్టానుసారం మాట్లాడుతున్నారని, పచ్చ మీడియాలో పిచ్చి కూతలు కూసి, పచ్చి రాతలు రాయించి పైశాచిక ఆనందం పొందుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్ముంటే వాళ్ల హయాంలో చేసిన సహాయం గురించి మాట్లాడాలని, అలా కాకుండా చేతల ప్రభుత్వాన్ని విమర్శిస్తే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని రోజా స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement