Saturday, May 4, 2024

జనాలు వస్తున్నా.. ఓట్లు రాలడం లేదు.. పవన్

జనాలు వస్తున్నారు.. ఓట్లు రాలడం లేదు.. అది మారాలని జనసేన అధినే పవన్ కళ్యాణ్ అన్నారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ… ప్రజా స్పందన వేరు.. దానిని ఓట్లుగా మార్చుకోవడం వేరన్నారు. టీడీపీ నాయకులను సీఎం చేయడానికి జనసేన లేదన్నారు. ముందు మన బలం ఎంతో బేరీజు వేసుకోవాలన్నారు. ఎంఐఎం లా కనీసం 7 స్థానాల్లో కూడా గెలిపించలేదన్నారు. 2009లో వచ్చిన 18 స్థానాలు కూడా రాలేదు కదా అన్నారు. కుల రాజకీయాలు తాను చేయనని పవన్ స్పష్టం చేశారు. నినాదాలతో సీఎంను కాలేనని, ఓట్లు వేస్తేనే సీఎం అవుతామన్నారు. తన మీద చూపిస్తున్న ప్రేమ, ఆదరణ, ఓట్ల కింద మార్చాలన్నారు. కష్టాలు వచ్చినప్పుడే పవన్ కళ్యాణ్ గుర్తొస్తారన్నారు. ఓట్లు వేసేటప్పుడు పవన్ ను మర్చిపోతారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement