Thursday, April 25, 2024

aided schools: వైసిపి ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ సెటైర్లు

కర్ణాటకలోని మంగళూరు ప్రాతంలో హరికేళ హజబ్బ అనే పండ్ల వ్యాపారి పాఠశాలను నిర్మించి… దేశంలోని నాలుగో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీని పొందిన సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని ఉటంకిస్తూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్…  ఏపీ ప్రభుత్వంపై సెటైర్లు వేశారు. ఎయిడెడ్ స్కూళ్ల పట్ల ప్రభుత్వ తీరును పవన్ కళ్యాణ్ తప్పు పట్టారు.

 ‘పండ్ల వ్యాపారి, పద్మశ్రీ పురస్కార గ్రహీత హరికేళ హజబ్బ తన సొంత సంపాదనతో పాఠశాలను ఎలా నిర్మించగలిగారు? ఏపీలోని వైసీపీ ప్రభుత్వం మాత్రం గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూళ్లు, కాలేజీలను మూసేస్తోంది’ అని విమర్శించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement