Thursday, May 2, 2024

Only Broker – ప‌వ‌న్ కల్యాణ్ ద‌ళ‌ప‌తి కాదు .. ద‌ళారిః రోజా

అమ‌రావ‌తి – జనసేనాని పవన్ కల్యాణ్ ద‌ళ‌పతి కాద‌ని, ఆయ‌నో ద‌ళారి అని విమ్శించారు మంత్రి రోజా . అమ‌రావ‌తిలో ఆమె మీడియాతో మాట్లాడుతూ,. టీడీపీ అధినేత చంద్రబాబు కోసం ఢిల్లీలో దళారిగా మారారని వ్యాఖ్యానించారు. తన తల్లిని తిట్టిన వ్యక్తి కోసం పవన్ దళారిగా మారడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో జనసేన, టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేసే అవకాశం ఉందని పవన్ ఢిల్లీలో చెప్పిన వ్యాఖ్యలపై రోజా స్పందిస్తూ… మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తామని సిగ్గులేకుండా చెప్పారని అన్నారు. పొత్తు పెట్టుకోవడానికి కొత్త పార్టీలు లేక మళ్లీ టీడీపీతోనే పొత్తు పెట్టుకున్నారని దుయ్యబట్టారు.

మోడీని తిట్టిన చంద్రబాబును ఎన్డీయే సమావేశానికి పిలవలేదని… కానీ, తన తల్లిని తిట్టించిన చంద్రబాబు కోసం పవన్ ఎన్డీయేతో కలిసిపోయాడని రోజా విమర్శించారు. ఏ పార్టీతో పొత్తు పెట్టుకోను అంటూ గతంలో ప్రగల్బాలు పలికిన పవన్ ఇప్పుడు సిగ్గు లేకుండా అందరి కాళ్లు పట్టుకుంటున్నారని మండిప‌డ్డారు . చంద్రబాబు ఊసరవెల్లి అనే విషయం బీజేపీకి తెలుసని… అందుకే ఎన్డీయే సమావేశానికి పిలవలేదని చెప్పారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేస్తానని చెప్పిన చంద్రబాబు చివరకు కాంగ్రెస్ ను కూడా మోసం చేశారని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement