Tuesday, April 30, 2024

Pani Puri: ఇద్ద‌రు చిన్నారుల ప్రాణం తీసిన పానీ పూరీ….

ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో విషాదం చోటు చేసుకుంది. పానీపూరీ తిన్న ఇద్దరు అన్నదమ్ములు అస్వస్థతకు గురై మృత్యువాత పడ్డారు. గ‌త‌ రాత్రి పానీపూరీ తిని కడుపునొప్పితో బాధపడుతున్న ఇద్దరు చిన్నారులను కుటుంబసభ్యులు ప్రైవేట్ ఆసుపత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలోనే చనిపోయారు. చనిపోయిన ఇద్దరు అన్నదమ్ములు వెలపాటి రామకృష్ణ (10), వెలపాటి విజయ్ (6) జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

పానీపూరీ తినడం వల్లే ఫుడ్ పాయిజన్ అయ్యి తమ బిడ్డలు చనిపోయారని మృతుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నంద్యాల జిల్లా వైఎస్సార్‌ కాలనీ నుంచి బ్రతుకుతెరువు కోసం ప్లాస్టిక్ వ్యాపారం చేసేందుకు జంగారెడ్డిగూడెంకు వెలపాటి కుటుంబం వలస వచ్చింది. ఊహించని రీతిలో ఇద్దరు పిల్లలు మృత్యువాతపడటంతో ఆప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి. మృతుల తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement