Wednesday, May 8, 2024

భక్తులతో కిక్కిరిసిన పంచారామ క్షేత్రం..

సామర్లకోట,(ప్రభన్యూస్): పంచారామ క్షేత్రం అయినా శ్రీ చాణుక్య కుమారరామ భీమేశ్వర స్వామి ఆలయంలో తొలి సోమవారం కావడంతో భక్తులతో కిక్కిరిసింది. ఆలయ కార్యనిర్వహణాధికారి పులి నారాయణ మూర్తి, ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ మట్టపల్లి రమేష్ బాబు తెల్లవారుజామున 3:30 గంటలకు గోపూజ ఉత్సవం ప్రారంభించారు.అనంతరం స్వామివారికి, అమ్మవారికి పిఠాపురం మహారాజు వారి గోత్రనామాలతో తొలి అభిషేక పూజలు నిర్వహించారు.

అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఆలయమంతా శివనామ స్మరణతో మార్మోగింది. స్వామివారిని, అమ్మవారిని రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దవులూరి దొరబాబు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.అనంతరం నంది మండపంలో ఆలయ పండితులు ఆశీర్వచనం అందజేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్లు,వైస్ చైర్మన్లు,కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement