Monday, April 29, 2024

Padma Vibhushan – చిరంజీవి, వెంకయ్య నాయుడులకు పద్మ విభూషణ్ పురస్కారాలు

74వ గణతంత్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వివిధ రంగాల్లో విశేష సేవలందించిన ప్రముఖులకు పద్మ అవార్డులు ప్రకటించింది. తెలుగు నాట సినీ రంగంలో విశేష సేవలందించిన మెగా స్టార్ చిరంజీవి, తెలుగు-జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించిన మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడులను పద్మ విభూషణ్ పురస్కారాలతో గౌరవించింది. ఇక 110కి పద్మశ్రీ, 17 మందికి పద్మ భూషణ్ అవార్డు లను ప్రకటించింది.

.వీరితోపాటు తమిళనాడుకు చెందిన ప్రముఖ సినీ నటి వైజయంతి మాల బాలి, బీహార్ రాష్ట్రం నుంచి బిందేశ్వర్ పాఠక్ (సాంఘిక సేవ), తమిళనాడుకు చెందిన పద్మ సుబ్రమణ్యంలకు పద్మ విభూషణ్ అవార్డులు ప్రకటించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement